అదానీ గ్రూప్ జాతీయ మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం మరియు అంతర్గత పరిపాలనపై మరింత దృష్టి పెట్టిందని కరణ్ ఆదానీ తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇంధనం, లాజిస్టిక్స్, కీలక ముడి పదార్థాలపై పెట్టుబడులు కొనసాగుతాయని చెప్పారు. సిటీ గ్యాస్ పంపిణీ, పవర్ ట్రాన్స్మిషన్, డేటా సెంటర్లు వంటి రంగాలు దీర్ఘకాల ప్రాధాన్యంగా ఉంటాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వదేశీకరణ లక్ష్యంగా, బ్రెజిల్కు చెందిన ఎంబ్రేర్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించారు.