ఉదయ్‌పూర్‌లో

ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక వివాహ వేడుకలు ప్రారంభం… సినీ ప్రముఖుల సందడి

Published on: 📅 25 Feb 2026, 06:52 AM
Reporter: 🖊

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా కానీ ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు వేడుకలకు హాజరైనట్లు సమాచారం. రేపు జరగనున్న ప్రధాన వివాహానికి మొత్తం వందమంది అతిథులు మాత్రమే పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Sponsored