statewide tea coffee and milk sales are halted a shocking decision by traders why

రాష్ట్రవ్యాప్తంగా టీ, కాఫీ, పాల విక్రయాలు బంద్.. వ్యాపారుల సంచలన నిర్ణయం, ఎందుకంటే?

Published on: 📅 23 Jul 2025, 06:26 PM
Reporter: 🖊

కర్ణాటకలో జీఎస్టీ నోటీసుల జారీతో చిన్న, సన్నకారు వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలపై పన్నులు విధించడాన్ని నిరసిస్తూ టీ, కాఫీ, పాల అమ్మకాలు నిలిపి వేశారు. ఇది మాత్రమే కాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ తమ పనులు చేసుకుంటున్నారు. మరోవైపు చాలామంది వ్యాపారులు నగదు లావాదేవీలకే పరిమితం అయ్యారు. సమస్య పరిష్కరించకుంటే జూలై 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని వ్యాపార సంఘాలు హెచ్చరించాయి. ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య త్వరలో వ్యాపారులతో సమావేశం కానున్నారు.

Sponsored