rs 436 crore for 290 lakh drivers today

2.90 లక్షల మంది డ్రైవర్లకు నేడు రూ.436 కోట్లు

Published on: 📅 04 Oct 2025, 10:45 AM
Reporter: 🖊

కూటమి ప్రభుత్వం 'ఆటో డ్రైవర్ సేవలో' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందిస్తారు. మొదటి విడతగా, అర్హులైన 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ. 436 కోట్లు జమ చేయనున్నారు. విజయవాడ సబ్ అర్బన్ సత్యనారాయణపేటలోని బసవ పున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. 'స్త్రీ శక్తి' పథకం అమలు వలన ఆదాయం తగ్గిన డ్రైవర్లను ఆదుకోవడానికి, గతంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి 3.23 లక్షల దరఖాస్తులు రాగా, 2.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.

Sponsored