న్యూఢిల్లీ లో ప్రముఖ నటులు రష్మిక–విజయ్ వివాహం అనంతరం హైదరాబాద్లో జరగనున్న విందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఇప్పటికే జంటకు శుభాకాంక్షలతో లేఖ పంపిన ప్రధాని, వారిని కలుసుకుని ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రష్మిక పసుపు రంగు సల్వార్ దుస్తుల్లో, విజయ్ తెల్లని వస్త్రధారణలో కనిపించారు. గౌరవ సూచకంగా ప్రధానికి శాలువా అందజేశారు. ఈ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రష్మిక–విజయ్ వివాహ వేడుక.. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించిన జంట
Published on: 📅 27 Feb 2026, 03:48 PM
Reporter: 🖊 Ramesh Kumar