ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్లో భాగంగా యూఏఈపై జరిగిన ఘాతుక దాడులపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. యూఏఈ ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్తో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించిన మోదీ, అక్కడ ఉన్న భారతీయుల క్షేమం కోసం UAE చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ ఇరాన్ యూఏఈ దాడులపై స్పందించారు
Published on: 📅 02 Mar 2026, 10:33 AM
Reporter: 🖊 Anitha Sharma