lokesh brought 35 thousand jobs to the youth in just one day

ఒక్క రోజులోనే యువతకు 35 వేల ఉద్యోగాలు తెచ్చిన లోకేశ్

Published on: 📅 10 Jul 2025, 09:42 AM
Reporter: 🖊

ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో పూర్తిగా దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని చంద్రబాబు తన బ్రాండ్ తో మళ్లీ ట్రాక్ లో పెడుతున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి లోకేశ్ ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెట్టుబడుల కోసం బెంగుళూరులో పర్యటించారు లోకేశ్. తాజాగా ఆ పర్యటన విజయవంతమై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ముందుకు వచ్చింది.

Sponsored