jaahnavi kandula death us settlement seattle 2026

“ఆమె జీవితం విలువైనది”: భారతీయ విద్యార్థిని మృతిపై అమెరికా స్పందన

Published on: 📅 12 Feb 2026, 02:34 PM
Reporter: 🖊

అమెరికాలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ విద్యార్థిని జాన్వి కందుల కేసులో సియాటిల్ నగరం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబంతో 29 మిలియన్ డాలర్ల (రూ.260 కోట్లకు పైగా) పరిహార ఒప్పందానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జాన్వి మరణం హృదయవిదారకమని, ఈ పరిహారం కుటుంబానికి కొంతైనా మనశ్శాంతి ఇవ్వాలని ఆశిస్తున్నామని సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ తెలిపారు. “జాన్వి జీవితం విలువైనది” అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Sponsored