ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి మూసుకుపోయింది. దీంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికా చమురు నిల్వలను విడుదల చేసినప్పటికీ ధరలు తగ్గడం లేదు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ రిజర్వులను వినియోగిస్తున్నాయి. భారత్ కూడా ఇంధన సరఫరాను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ప్రభావం తగ్గించేందుకు పలు దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. పరిస్థితిని అంతర్జాతీయ సంస్థలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి మూసివేత.. ప్రపంచానికి ఇంధన సంక్షోభం ముప్పు
7
Published on: 📅 13 Mar 2026, 02:50 PM
Reported by: 🖊
Kiran Rao