మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం సరైంది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేశారా అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే ఇళ్లను కూల్చేందుకు ఎందుకు సిద్ధమయ్యారో స్పష్టం చేయాలని అన్నారు. డబ్బులే లేవంటున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణకు భారీగా నిధులు ఖర్చు చేయాలని చెప్పడం విచిత్రమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 10 వేల ఇళ్లు కూల్చాలని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
మూసీ ప్రాజెక్టుపై హరీశ్రావు విమర్శలు.. పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎందుకు?
6
Published on: 📅 13 Mar 2026, 03:42 PM
Reported by: 🖊
Ramesh Kumar