governments diwali gift to rtc employees

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక

Published on: 📅 21 Oct 2025, 07:10 AM
Reporter: 🖊

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ (పీఆర్‌సీ) అమలు చేస్తూ ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. నాలుగు కేడర్ల ఉద్యోగుల పద్ధతుల్లో అవకావం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. దీంతో మెకానికల్, డ్రైవర్లు, కండక్టర్లు, ఆపరేషన్స్ కేడర్‌లోని ఉద్యోగులు పండుగ అడ్వాన్స్‌తో సంబంధం లేకుండా పీఆర్‌సీ పొందడానికి అర్హులయ్యారు. అయితే, ఆరు విభాగాలకు వర్తించేలా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. కేవలం రెండు విభాగాలకే వర్తింపజేస్తే అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది.

Sponsored