ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం రాబోయే నాలుగు రోజుల్లో ఉపరితల ద్రోణిగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా ఈ నెల 7 తర్వాత కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉందని తెలిపింది. నిన్న దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలులో 38°C నమోదైంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… 7 తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు సూచన
Published on: 📅 03 Mar 2026, 09:43 AM
Reporter: 🖊 Suresh Reddy