apnrts will be a support for nris minister kondapalli srinivas

ఎన్నారైలకు ఏపీఎన్నార్టీఎస్ అండగా ఉంటుంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Published on: 📅 10 Jul 2025, 09:43 AM
Reporter: 🖊

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమ సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ఎన్నారైలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఎన్నారైల కోసం అమరావతిలో ఐకాన్ టవర్ ను నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి నిర్మాణంలో, పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఎన్నారైలకు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై, ఎన్నారైల సాధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీఎన్నార్టీఎస్ ద్వారా ఎన్ఆర్ఐల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.

Sponsored