ap digital technology summit 2026 on 9 10th of this month in visakhapatnam

విశాఖలో ఈ నెల 9–10న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్–2026

Published on: 📅 08 Jan 2026, 09:53 AM
Reporter: 🖊

రెండో ఎడిషన్ **ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్–2026** ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్నారు. ఉ.9.15 నుంచి సా.5.30 వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో సదస్సు జరగనుంది. తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెండో రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారు. ఐటీ, ఏఐ నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధకులతో పాటు విద్యార్థులు కలిపి సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

Sponsored