డీఏ అరియర్స్ బిల్లుల సమర్పణలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నెల రోజుల్లో ఆదేశాలు జారీ చేస్తుందని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు 2018 జులై నుంచి డీఏ అరియర్లు మంజూరు చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి చెల్లింపులు అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డీఏ అరియర్స్ బిల్లుల సమస్యకు నెలలో పరిష్కారం: AP JAC
Published on: 📅 04 Mar 2026, 09:07 AM
Reporter: 🖊 Anitha Sharma