POP BITES

Weekly Magazine

బుమ్రా వల్లే విజయం… POTM తనకంటే అతడికే అర్హుడు: సంజూ శాంసన్

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ చివరి దశలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆటను భారత్ వైపు తిప్పిన జస్ప్రీత్ బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. ‘బుమ్రా నిజంగా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా అతడే ఎక్కువ అర్హుడు అని శాంసన్ కొనియాడాడు.

Vol. 10 • Issue 10
Feb 27 - Mar 06, 2026

Contents

Featured Stories

బుమ్రా వల్లే విజయం… POTM తనకంటే అతడికే అర్హుడు: సంజూ శాంసన్ 3
AIతో యుద్ధం… 12 గంటల్లో 900 టార్గెట్లపై దాడులు 4
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా 5
ట్రంప్‌పై UAE బిలియనీర్ విమర్శలు 6
'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభం 7

Politics

ఆంథ్రోపిక్‌పై పెంటగాన్ నిషేధం… సరఫరా-చైన్ ప్రమాదంగా ప్రకటింపు 8
ప్రధాని మోదీ ఇరాన్ యూఏఈ దాడులపై స్పందించారు 9
గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 10

Andhra

శనివారం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గుట్టపల్లి సాయి ప్రసాద్ 11
చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత 12
గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం 13

Telangana

చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత 14
ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల పెట్రోలు బంకులు.. ‘ఇందిరా మహిళాశక్తి’కు శ్రీకారం 15
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా 16

Sports

టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన మార్క్రమ్, హార్దిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా, భారత్‌కు ఘన విజయాలు 17
ఫిఫా వరల్డ్‌కప్‌ కల చెదిరింది… భారత వ్యాపారవేత్తకు యూఎస్ వీసా నిరాకరణ 18
రంజీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ ఆధిపత్యం… తొలి టైటిల్‌కు అడుగు దూరం 19

Movies

రహస్యంగా పెళ్లి చేసుకున్న రష్మిక–విజయ్… సెలబ్రిటీల శుభాకాంక్షలు 20
రష్మిక–విజయ్ వివాహ వేడుక.. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించిన జంట 21
భారత్–పాక్ గూఢచారి కోణం కారణంగా ‘ఏజెంట్ వినోద్’కు ధర్మేంద్ర నో 22

World News

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ? F-16 కూల్చివేతపై తాలిబాన్ సంచలన ప్రకటన 23
ఫిబ్రవరి చివర్లో ఆకాశంలో అరుదైన గ్రహాల కవాతు 24
AI ప్రభావంతో భారీ ఉద్యోగ కోతలు… బ్లాక్ కంపెనీ సంచలన నిర్ణయం 25

India News

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ ప్రచారానికి బ్రేక్ 26
12 ఏళ్లలో భారత స్వశక్తి వికాసం.. వాణిజ్య ఒప్పందాలకు ముందుకొస్తున్న అభివృద్ధి దేశాలు: ప్రధాని 27
రష్యా నుంచి మరో 5 ఎస్-400 స్క్వాడ్రన్లు కొనుగోలు దిశగా భారత్ 28

Weekly Statistics

This Week in Numbers 29

Politics

11 stories this week

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఇక నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్‌ను నియమించింది. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్. రవిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు త్వరలో అమల్లోకి రానున్నాయి.

'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభం

'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాభివృద్ధి వంటి విభాగాలపై విడతల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అలాగే ఈరోజు నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 18న లక్ష మందికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 2028 నాటికి పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక TDR బాండ్ల జారీ విషయంలో గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన తేదీ ఖరారైంది. ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుందని వెల్లడించారు. తొలి విడతలో రూ.80 వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్: కర్ణాటక

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్: కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఫిన్‌ల్యాండ్, యూకే కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

నేపాల్ రాజకీయాల్లో Gen-Z నాయకుడు బాలెన్ షా

నేపాల్ రాజకీయాల్లో Gen-Z నాయకుడు బాలెన్ షా

నేపాల్‌లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతున్న Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపిస్తున్నారు. 36 ఏళ్ల ఈ యువ నేత స్ట్రక్చరల్ ఇంజినీర్ మాత్రమే కాకుండా ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా మద్దతు లభించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఆయన పార్టీ RSP విజయం సాధిస్తే బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

జగన్‌పై చంద్రబాబు విమర్శలు

జగన్‌పై చంద్రబాబు విమర్శలు

పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు విమర్శించారు. గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైసీపీ డ్రామాల వల్ల అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని అన్నారు. వారి వాహనాల టైర్లు ప్రజలను తొక్కేస్తున్నాయని ఆరోపించారు. తరువాత ఆ నిందను ప్రభుత్వంపైనే మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లే పోస్టుమార్టమ్‌కు వెళతారని సెటైర్ వేశారు.

నితీశ్ కుమార్ CM పదవిని రాజీనామా చేసి RSకు? రాజకీయాల్లో సంచలన ప్రచారం

నితీశ్ కుమార్ CM పదవిని రాజీనామా చేసి RSకు? రాజకీయాల్లో సంచలన ప్రచారం

CM పదవికి నితీష్ కుమార్ నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్‌కు కేంద్ర క్యాబినెట్‌లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్‌ను వెంటనే అమలు చేయలేదు. ఇప్పుడు నితీశ్‌ను కేంద్రమంత్రి చేసి, బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు BJP చేపట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది, రాష్ట్ర రాజకీయాలు కొత్త దిశలోకి వెళ్తున్నాయి

ప్రధాని మోదీ ఇరాన్ యూఏఈ దాడులపై స్పందించారు

ప్రధాని మోదీ ఇరాన్ యూఏఈ దాడులపై స్పందించారు

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా యూఏఈపై జరిగిన ఘాతుక దాడులపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. యూఏఈ ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించిన మోదీ, అక్కడ ఉన్న భారతీయుల క్షేమం కోసం UAE చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు

ఆంథ్రోపిక్‌పై పెంటగాన్ నిషేధం… సరఫరా-చైన్ ప్రమాదంగా ప్రకటింపు

ఆంథ్రోపిక్‌పై పెంటగాన్ నిషేధం… సరఫరా-చైన్ ప్రమాదంగా ప్రకటింపు

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ **ఆంత్రోపిక్ పిబిసి**ను సరఫరా-చైన్ ప్రమాదంగా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రక్షణ మంత్రిపీట్ హెగ్సేత్ఆంథ్రోపిక్‌తో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. దీనిపై ఆంథ్రోపిక్ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది. బాధ్యతాయుత AI వినియోగంపై తమ వైఖరిని మార్చబోమని సంస్థ స్పష్టం చేసింది

Andhra

14 stories this week

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 18న లక్ష మందికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 2028 నాటికి పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక TDR బాండ్ల జారీ విషయంలో గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ… దర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ… దర్శనానికి 18 గంటలు

తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం మొత్తం 59,194 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 25,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

తిరుమలలో బర్త్‌డే వేడుకలు… TTD ఫిర్యాదు

తిరుమలలో బర్త్‌డే వేడుకలు… TTD ఫిర్యాదు

తిరుమలలో దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. అక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జగన్‌పై చంద్రబాబు విమర్శలు

జగన్‌పై చంద్రబాబు విమర్శలు

పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు విమర్శించారు. గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైసీపీ డ్రామాల వల్ల అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని అన్నారు. వారి వాహనాల టైర్లు ప్రజలను తొక్కేస్తున్నాయని ఆరోపించారు. తరువాత ఆ నిందను ప్రభుత్వంపైనే మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లే పోస్టుమార్టమ్‌కు వెళతారని సెటైర్ వేశారు.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ర్వహిస్తున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు హోలీ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థులకు సింధీ, మలయాళం, ఒడియా, అస్సామీ, కన్నడ, కోక్‌బొరోక్ భాషల పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతున్నాయి. 12వ తరగతి విద్యార్థులు సైకాలజీ పరీక్ష రాస్తున్నారు. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో మార్చి 5,6 తేదీల పరీక్షలను వాయిదా వేశారు. మొత్తం ఈ ఏడాది సుమారు 43 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు

భారత్‌లో మోటరోలా కొత్త మోటో వాచ్… రూ.5,999 నుంచే ధర

భారత్‌లో మోటరోలా కొత్త మోటో వాచ్… రూ.5,999 నుంచే ధర

స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి మోటరోలా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో కొత్తగా విడుదలైన మోటో వాచ్ ధర స్టెయిన్‌లెస్ స్టీల్ వర్షన్‌కు రూ.5,999 కాగా, లెదర్ స్ట్రాప్ వర్షన్ రూ.6,999గా ఉంది. ఈ వాచ్ 47mm కేస్ సైజ్‌తో, మ్యాట్ బ్లాక్ మరియు మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శాండ్‌బ్లాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం డిజైన్‌ను అందిస్తోంది. గతంలో విడుదలైన మోటో 360 తర్వాత మోటరోలా స్మార్ట్‌వాచ్ విభాగంలో మళ్లీ తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది.

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న టెన్షన్స్ నేపధ్యంలో, మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. ఇండియా ఇంధన సంస్థల నిల్వలతో పాటు, విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లో సుమారు 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ (SPR) అంటారు. 2015లో ఫేజ్-1 ప్రారంభమై, భవిష్యత్తులో మరిన్ని SPR సైట్‌లు ఏర్పాటుచేయబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా కోసం వీటిని ఉంచారు.

AP SSC హాల్ టికెట్లు త్వరలో విడుదల – ఈ వారం నుంచే డౌన్‌లోడ్ అవకాశం

AP SSC హాల్ టికెట్లు త్వరలో విడుదల – ఈ వారం నుంచే డౌన్‌లోడ్ అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ వారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు చెందిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకారం మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే SSC పరీక్షలకు హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా మన మిత్ర వాట్సాప్ సేవ (9552300009) మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ యొక్క లీపు మొబైల్ యాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు. మార్చి 2న కొద్దిసేపు హాల్ టికెట్ లింక్ యాక్టివ్ అయ్యింది కానీ తరువాత నిలిపివేశారు. త్వరలో మళ్లీ డౌన్‌లోడ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. విద్యార్థులు పరీక్షల ముందు హాల్ టికెట్ తప్పనిసరిగా పొందాలని

డీఏ అరియర్స్ బిల్లుల సమస్యకు నెలలో పరిష్కారం: AP JAC

డీఏ అరియర్స్ బిల్లుల సమస్యకు నెలలో పరిష్కారం: AP JAC

డీఏ అరియర్స్ బిల్లుల సమర్పణలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నెల రోజుల్లో ఆదేశాలు జారీ చేస్తుందని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు 2018 జులై నుంచి డీఏ అరియర్లు మంజూరు చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి చెల్లింపులు అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… 7 తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… 7 తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం రాబోయే నాలుగు రోజుల్లో ఉపరితల ద్రోణిగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా ఈ నెల 7 తర్వాత కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉందని తెలిపింది. నిన్న దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలులో 38°C నమోదైంది.

చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత

చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత

చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దర్శనాలను నిలిపివేయనున్నారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను ఉదయం 7 గంటలకే మూసివేసి, బుధవారం తిరిగి తెరవనున్నట్లు యాజమాన్యం తెలిపింది. రేపు జరగాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజే సాయంత్రం నిర్వహించనున్నారు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భారత్‌కు తిరిగి రావాలనుకునేవారికి ప్రస్తుతం ఒకే ప్రత్యామ్నాయం ఉందని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తెలిపారు. అదే Oman మార్గం. ఆ దేశంపై ఇరాన్ దాడులు చేయకపోవడంతో, భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Dubai నుంచి ఒమన్ రాజధాని Muscat వరకు సుమారు 450 కిలోమీటర్లు బైరోడ్ ప్రయాణించాల్సి ఉంటుంది.

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు

శనివారం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గుట్టపల్లి సాయి ప్రసాద్

శనివారం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గుట్టపల్లి సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా గుట్టపల్లి సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. **అమరావతి**లోని ఏపీ సచివాలయంలో ఉదయం 11.33 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా సేవలు ప్రారంభించి, కర్నూల్ కలెక్టర్‌, పలు విద్యుత్‌ సంస్థల సీఎండీగా, కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అనుభవజ్ఞుడైన పరిపాలనాధికారిగా ఆయన నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది

Telangana

8 stories this week

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఇక నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్‌ను నియమించింది. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్. రవిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు త్వరలో అమల్లోకి రానున్నాయి.

'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభం

'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాభివృద్ధి వంటి విభాగాలపై విడతల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అలాగే ఈరోజు నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.

ప్రైవేటు స్కూళ్లకు ప్రొఫెషనల్ ట్యాక్స్ నోటీసులు

ప్రైవేటు స్కూళ్లకు ప్రొఫెషనల్ ట్యాక్స్ నోటీసులు

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ పన్ను వసూలు చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరిస్తోంది. ఈ చర్యలతో ఫీజుల నియంత్రణకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ర్వహిస్తున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు హోలీ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థులకు సింధీ, మలయాళం, ఒడియా, అస్సామీ, కన్నడ, కోక్‌బొరోక్ భాషల పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతున్నాయి. 12వ తరగతి విద్యార్థులు సైకాలజీ పరీక్ష రాస్తున్నారు. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో మార్చి 5,6 తేదీల పరీక్షలను వాయిదా వేశారు. మొత్తం ఈ ఏడాది సుమారు 43 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు

భారత్‌లో మోటరోలా కొత్త మోటో వాచ్… రూ.5,999 నుంచే ధర

భారత్‌లో మోటరోలా కొత్త మోటో వాచ్… రూ.5,999 నుంచే ధర

స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి మోటరోలా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో కొత్తగా విడుదలైన మోటో వాచ్ ధర స్టెయిన్‌లెస్ స్టీల్ వర్షన్‌కు రూ.5,999 కాగా, లెదర్ స్ట్రాప్ వర్షన్ రూ.6,999గా ఉంది. ఈ వాచ్ 47mm కేస్ సైజ్‌తో, మ్యాట్ బ్లాక్ మరియు మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శాండ్‌బ్లాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం డిజైన్‌ను అందిస్తోంది. గతంలో విడుదలైన మోటో 360 తర్వాత మోటరోలా స్మార్ట్‌వాచ్ విభాగంలో మళ్లీ తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది.

తెలుగు శీర్షిక:  తెలంగాణలో అరుదైన హోళీ సంప్రదాయం: 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘హున్సా ఫిస్ట్ ఫైట్

తెలుగు శీర్షిక: తెలంగాణలో అరుదైన హోళీ సంప్రదాయం: 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘హున్సా ఫిస్ట్ ఫైట్

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో హోళీ పండుగను ప్రత్యేకంగా జరుపుకునే అరుదైన సంప్రదాయం ఉంది. ఇక్కడ రంగులతో కాకుండా ‘హున్సా ఫిస్ట్ ఫైట్’ అనే పద్ధతిలో హోళీని జరుపుకుంటారు. హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి తాడు రెండు వైపులా నిలబడి ఒకరికి ఒకరు పంచ్‌లు ఇచ్చుకుంటారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ ఫైట్ కొనసాగుతుంది కానీ ఎవరూ తాడు దాటరు. గ్రామ పెద్దల ప్రకారం ఈ సంప్రదాయం దాదాపు 450 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం గ్రామానికి శ్రేయస్సు, సంపద తీసుకొస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. చివరలో పాల్గొన్నవారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల పెట్రోలు బంకులు.. ‘ఇందిరా మహిళాశక్తి’కు శ్రీకారం

ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల పెట్రోలు బంకులు.. ‘ఇందిరా మహిళాశక్తి’కు శ్రీకారం

తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఈ కేంద్రాలను నెలకొల్పనున్నారు. జిల్లా యంత్రాంగం అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనలు మిషన్ ఫర్ ఎలిమినేషన్ అఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ కు పంపాలి. ఏఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్ సంఘాలు నిధులు సమకూర్చనున్నాయి. ఆయిల్ సంస్థలు, లీగల్ మెట్రాలజీ శాఖల అనుమతులు తీసుకోవాలి. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత

చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత

చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దర్శనాలను నిలిపివేయనున్నారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను ఉదయం 7 గంటలకే మూసివేసి, బుధవారం తిరిగి తెరవనున్నట్లు యాజమాన్యం తెలిపింది. రేపు జరగాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజే సాయంత్రం నిర్వహించనున్నారు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Sports

10 stories this week

బుమ్రా వల్లే విజయం… POTM తనకంటే అతడికే అర్హుడు: సంజూ శాంసన్

బుమ్రా వల్లే విజయం… POTM తనకంటే అతడికే అర్హుడు: సంజూ శాంసన్

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ చివరి దశలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆటను భారత్ వైపు తిప్పిన జస్ప్రీత్ బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. ‘బుమ్రా నిజంగా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా అతడే ఎక్కువ అర్హుడు అని శాంసన్ కొనియాడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా 500 వికెట్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా 500 వికెట్లు

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయి చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు పూర్తి చేశారు. ఇవాళ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 235 మ్యాచ్‌లు ఆడారు. కెరీర్‌లో 18 సార్లు ఐదు వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు మాత్రం అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆయన 401 మ్యాచ్‌ల్లో 953 వికెట్లు తీశారు.

ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న రోహిత్ శర్మ

ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న రోహిత్ శర్మ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 కోసం సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫోటోషూట్‌కు పోజులిచ్చారు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ ఇప్పటికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్ ఈ సీజన్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. క్రీడావర్గాల సమాచారం ప్రకారం మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.

సిక్స్ క్యాచ్ పట్టిన ఫ్యాన్… సోషల్ మీడియాలో వైరల్ వీడియో

సిక్స్ క్యాచ్ పట్టిన ఫ్యాన్… సోషల్ మీడియాలో వైరల్ వీడియో

పాకిస్తాన్‌లో జరిగిన పాకిస్తాన్ టేప్‌బాల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఒక ఫ్యాన్ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్స్‌మన్ ఫుల్‌టాస్ బంతిని కౌ కార్నర్ వైపు భారీ సిక్స్‌గా కొట్టాడు. బౌండరీ బయట ఉన్న ఓ అభిమాని పరుగెత్తుకుంటూ వెళ్లి బంతిని గాల్లోనే క్యాచ్ పట్టాడు. అంతేకాకుండా ఫెన్స్ మధ్యగా జారుకుని సురక్షితంగా బయటపడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్: భారత్ vs ఇంగ్లాండ్ పోరుకు వాంఖెడే సిద్ధం

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్: భారత్ vs ఇంగ్లాండ్ పోరుకు వాంఖెడే సిద్ధం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో కీలక సెమీఫైనల్ పోరు కోసం వాంఖెడే స్టేడియం సిద్ధమైంది. మార్చి 5న భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు కివీస్‌తో ఫైనల్‌లో పోటీ పడుతుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్ 8లో మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఓడింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ఇంగ్లాండ్ సూపర్ 8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై వరుస విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది

వెస్టిండీస్‌పై ఘన విజయం.. సెమీస్‌లో భారత్, కొత్త రికార్డుల వరద

వెస్టిండీస్‌పై ఘన విజయం.. సెమీస్‌లో భారత్, కొత్త రికార్డుల వరద

వెస్టిండీస్‌పై అద్భుత విజయంతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన అత్యధిక విజయవంతమైన చేజ్‌ను నమోదు చేసింది. ఈ విజయంతో భారత జాతీయ క్రికెట్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు తర్వాత అతిపెద్ద లక్ష్యాన్ని చేజ్ చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది.

గచ్చిబౌలిలో ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రారంభం

గచ్చిబౌలిలో ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రారంభం

హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎఫ్‌ఐహెచ్ (FIH) మరియు హాకీ ఇండియా తో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ ఈ టోర్నీని నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళల జాతీయ హాకీ జట్టు తో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఈ టోర్నీ హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

రంజీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ ఆధిపత్యం… తొలి టైటిల్‌కు అడుగు దూరం

రంజీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ ఆధిపత్యం… తొలి టైటిల్‌కు అడుగు దూరం

జమ్మూ కాశ్మీర్ - కర్ణాటక మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసిన జేకే, శుభమ్ పుండీర్ శతకం (121)తో బలమైన స్కోర్ నమోదు చేసింది. బౌలింగ్‌లో ఔకిబ్ నబీ ఐదు వికెట్లు తీసి కర్ణాటకను 293కే కట్టడి చేశాడు. మయాంక్ అగర్వాల్ (160) శతకం వృథా అయింది. ప్రస్తుతం 480కుపైగా లీడ్‌తో జమ్మూ కశ్మీర్ తొలి టైటిల్‌కు అంచుల వద్ద నిలిచింది

టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన మార్క్రమ్, హార్దిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా, భారత్‌కు ఘన విజయాలు

టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన మార్క్రమ్, హార్దిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా, భారత్‌కు ఘన విజయాలు

టీ20 ప్రపంచకప్‌లో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రామ్ 46 బంతుల్లో అజేయ 82 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. లుంగి ఎన్‌గిడీ మూడు వికెట్లు తీసి జట్టుకు బలమైన ఆధిక్యం అందించాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో భారత్, జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడంలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు భారత్ సెమీఫైనల్ ఆశలను నిలబెట్టుకుంది

ఫిఫా వరల్డ్‌కప్‌ కల చెదిరింది… భారత వ్యాపారవేత్తకు యూఎస్ వీసా నిరాకరణ

ఫిఫా వరల్డ్‌కప్‌ కల చెదిరింది… భారత వ్యాపారవేత్తకు యూఎస్ వీసా నిరాకరణ

ఫిఫా వరల్డ్‌కప్‌ చూడాలన్న భారత వ్యాపారవేత్త, అతని భార్య ఆశలు వీసా నిరాకరణతో అడ్డంకి పడ్డాయి. రూ.25 లక్షల వార్షిక ఆదాయం ఉన్న 26 ఏళ్ల మేనేజింగ్ డైరెక్టర్,ఫిఫా ప్రపంచ కప్ కోసం B1/B2 వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో ప్రయాణ ఉద్దేశం, జీతం, గత ప్రయాణాలపై ప్రశ్నలు వేసిన అధికారి చివరకు 214(b) స్లిప్ ఇచ్చి వీసాను తిరస్కరించారు. భార్యను ప్రశ్నించకపోవడం గమనార్హం. ఈ అనుభవాన్ని అతడు **రెడ్డిట్**లో పంచుకోగా, పోస్ట్ వైరల్‌గా మారింది.

Movies

8 stories this week

సూపర్ హీరో కామెడీలో సల్మాన్ ఖాన్?

సూపర్ హీరో కామెడీలో సల్మాన్ ఖాన్?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించనున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సమాచారం. స్టోరీ సల్మాన్‌కు నచ్చినప్పటికీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు సూచించినట్లు తెలుస్తోంది. రిటైర్ అవ్వాలని అనుకునే ప్రతిసారి సమస్యలు వచ్చి మళ్లీ యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో ఈ కథ ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘ధురంధర్-2’ ట్రైలర్ రేపు రిలీజ్

‘ధురంధర్-2’ ట్రైలర్ రేపు రిలీజ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్-2’ ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈసారి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుందని తెలిపింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

హైదరాబాద్‌లో రష్మిక–విజయ్ గ్రాండ్ రిసెప్షన్… ప్రముఖుల హాజరు

హైదరాబాద్‌లో రష్మిక–విజయ్ గ్రాండ్ రిసెప్షన్… ప్రముఖుల హాజరు

నటీనటులు రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని **తాజ్ కృష్ణ**లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి దంపతులు హాజరుకానున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న **ఐటీసీ మెమెంటోలు**లో ద్వంద్వ వివాహ వేడుకలో పెళ్లి చేసుకుంది.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందస్తు విడుదల?.. సంగీత దర్శకుడిపై చర్చ

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందస్తు విడుదల?.. సంగీత దర్శకుడిపై చర్చ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన మార్చి 26 తేదీ కంటే వారం ముందే విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నేపథ్య సంగీతం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

అల్లు ఇంట సందడి చేసిన ‘విరోష్’ జంట.. శిరీష్ పెళ్లి వేడుకల్లో హాజరు

అల్లు ఇంట సందడి చేసిన ‘విరోష్’ జంట.. శిరీష్ పెళ్లి వేడుకల్లో హాజరు

పెళ్లి తర్వాత బిజీబిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనుండగా, నిన్న జరిగిన పెళ్లికొడుకు వేడుకకు ‘విరోష్’ జోడీ హాజరైంది. వారికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలకు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యే అవకాశముంది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న రష్మిక–విజయ్… సెలబ్రిటీల శుభాకాంక్షలు

రహస్యంగా పెళ్లి చేసుకున్న రష్మిక–విజయ్… సెలబ్రిటీల శుభాకాంక్షలు

నటీనటులు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉడయపూర్‌లోని **ఐటీసీ స్మరణికలు**లో జరిగిన ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించారు. ముందుగా సంప్రదాయ తెలుగు పద్ధతిలో, అనంతరం కొడవ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. ఎనిమిదేళ్లుగా తమ ప్రేమను గోప్యంగా ఉంచిన ఈ జంట, మీడియా హడావుడి లేకుండా సన్నిహితుల సమక్షంలోనే వివాహం చేసుకుంది. ఈ శుభవార్తపై పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, విక్కీ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపాడు

రష్మిక–విజయ్ వివాహ వేడుక.. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించిన జంట

రష్మిక–విజయ్ వివాహ వేడుక.. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించిన జంట

న్యూఢిల్లీ లో ప్రముఖ నటులు రష్మిక–విజయ్ వివాహం అనంతరం హైదరాబాద్‌లో జరగనున్న విందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఇప్పటికే జంటకు శుభాకాంక్షలతో లేఖ పంపిన ప్రధాని, వారిని కలుసుకుని ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రష్మిక పసుపు రంగు సల్వార్ దుస్తుల్లో, విజయ్ తెల్లని వస్త్రధారణలో కనిపించారు. గౌరవ సూచకంగా ప్రధానికి శాలువా అందజేశారు. ఈ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

భారత్–పాక్ గూఢచారి కోణం కారణంగా ‘ఏజెంట్ వినోద్’కు ధర్మేంద్ర నో

భారత్–పాక్ గూఢచారి కోణం కారణంగా ‘ఏజెంట్ వినోద్’కు ధర్మేంద్ర నో

బాలీవుడ్ దర్శకుడు Sriram Raghavan రూపొందించిన గూఢచారి కథా చిత్రం **Agent Vinod**లో నటించేందుకు ప్రముఖ నటుడు Dharmendra ఆసక్తి చూపలేదని సమాచారం. భారత్–పాకిస్థాన్ నేపథ్యంతో గూఢచారి వ్యవహారం ప్రధానాంశంగా ఉండటం ఆయన నిర్ణయానికి కారణమని చెప్పబడుతోంది. ఇదే సమయంలో రాఘవన్ తెరకెక్కించిన యుద్ధ నేపథ్య చిత్రం Ikkis ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ప్రేక్షకాదరణ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఒటిటి వేదికల ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

World News

28 stories this week

AIతో యుద్ధం… 12 గంటల్లో 900 టార్గెట్లపై దాడులు

AIతో యుద్ధం… 12 గంటల్లో 900 టార్గెట్లపై దాడులు

అమెరికా మిలిటరీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక అస్త్రంగా మారుతోంది. ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన సమయంలో కేవలం 12 గంటల్లోనే 900కుపైగా లక్ష్యాలపై దాడులు జరగడం AI సహాయంతో సాధ్యమైంది. ‘మేవెన్’ అనే స్మార్ట్ సిస్టమ్ 150కుపైగా సోర్సుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించి సెకన్లలోనే టార్గెట్లను గుర్తించింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాత డేటా వల్ల తప్పు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ట్రంప్‌పై UAE బిలియనీర్ విమర్శలు

ట్రంప్‌పై UAE బిలియనీర్ విమర్శలు

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో UAEబిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.‘బోర్డ్ ఆఫ్ పీస్’ కోసం గల్ఫ్ దేశాలు భారీగా నిధులు ఇచ్చాయని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని నిలదీశారు. యుద్ధాలు ఉండవని చెప్పినా ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్లు నిర్వహించారని మండిపడ్డారు. ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.

ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్: ట్రంప్ వ్యాఖ్యలు

ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్: ట్రంప్ వ్యాఖ్యలు

ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వ్యాఖ్యతో చర్చకు దారితీశారు. ప్రస్తుతం ఇరాన్‌పై పోరుపై పూర్తిగా దృష్టి పెట్టానని తెలిపారు. అది ముగిసిన తర్వాత త్వరలోనే క్యూబా అంశాన్ని పరిశీలిస్తానని వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు క్యూబా చాలా ఆసక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా క్యూబాపై పలు ఆంక్షలు విధించింది. అలాగే భవిష్యత్తులో క్యూబాను అమెరికా స్నేహపూర్వకంగా తమ వైపు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌లో 130 గంటలుగా ఇంటర్నెట్ బ్లాక్

ఇరాన్‌లో 130 గంటలుగా ఇంటర్నెట్ బ్లాక్

ఇజ్రాయెల్–అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో 130 గంటలకు పైగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం 1 శాతం మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉందని ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ నెట్ బ్లాక్స్ వెల్లడించింది. గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి టెలికమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భద్రతా కారణాల వల్ల అంతర్గత సమాచారం బయటకు లీక్ కాకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నేపాల్ రాజకీయాల్లో Gen-Z నాయకుడు బాలెన్ షా

నేపాల్ రాజకీయాల్లో Gen-Z నాయకుడు బాలెన్ షా

నేపాల్‌లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతున్న Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపిస్తున్నారు. 36 ఏళ్ల ఈ యువ నేత స్ట్రక్చరల్ ఇంజినీర్ మాత్రమే కాకుండా ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా మద్దతు లభించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఆయన పార్టీ RSP విజయం సాధిస్తే బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా నుంచి భారత్‌కు భారీగా క్రూడాయిల్

రష్యా నుంచి భారత్‌కు భారీగా క్రూడాయిల్

అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు రానుంది. సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు ఇప్పటికే భారత తీరానికి సమీపంలో ఉన్నట్లు సమాచారం. అవి వచ్చే వారం మన దేశ పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ డేటా తెలిపింది. సింగపూర్ సమీపంలో ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలో భారత్‌కు రానున్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి స్పష్టమైన సంకేతం రాకముందే రష్యా ట్యాంకర్లు భారత్ వైపు మళ్లినట్లు సమాచారం.

దుబాయ్‌లో యుద్ధ భయం… ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్

దుబాయ్‌లో యుద్ధ భయం… ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్

యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశం దుబాయ్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవారు వెంటనే సమీపంలోని షెల్టర్లకు వెళ్లాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇరాన్‌కు రష్యా సాయం? అమెరికా ఆరోపణలు

ఇరాన్‌కు రష్యా సాయం? అమెరికా ఆరోపణలు

యుద్ధ పరిస్థితుల్లో రష్యా ఇరాన్‌కు సాయం చేస్తున్నట్లు అమెరికా రక్షణ అధికారులు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో మోహరించిన అమెరికన్ వార్‌షిప్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని రష్యా ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల ద్వారా రష్యా పరోక్షంగా యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నట్టు భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే చైనా మాత్రం ఇలాంటి చర్యల్లో పాల్గొనడం లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య వైరల్ అవుతున్న ‘పేపర్ స్ట్రా’ మీమ్స్

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య వైరల్ అవుతున్న ‘పేపర్ స్ట్రా’ మీమ్స్

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సోషల్ మీడియాలో వినోదాత్మక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తడిసిపోయే ‘పేపర్ స్ట్రా’లను ఉపయోగిస్తూ ప్రపంచ వ్యంగ్యాన్ని చూపించే పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ప్రజలు పర్యావరణాన్ని కాపాడేందుకు చిన్న మార్పులు చేస్తున్నప్పటికీ, ప్రపంచ నాయకులు పెద్ద స్థాయి యుద్ధాలు, సంక్షోభాలపై దృష్టి పెట్టడం లేదని మీమ్స్ వ్యంగ్యంగా చెబుతున్నాయి. ముఖ్యంగా X, Instagram,రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మీమ్స్ భారీగా షేర్ అవుతున్నాయి.

ఇరాన్ యుద్ధంలో అమెరికా మిలిటరీకు ట్రంప్ ప్రశంసలు.. 10కి 15 మార్కులు ఇచ్చిన మాజీ అధ్యక్షుడు

ఇరాన్ యుద్ధంలో అమెరికా మిలిటరీకు ట్రంప్ ప్రశంసలు.. 10కి 15 మార్కులు ఇచ్చిన మాజీ అధ్యక్షుడు

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అద్భుతంగా పోరాడుతోందని మాజీ అధ్యక్షుడు Donald Trump ప్రశంసించారు. తమ సైన్యానికి 10కి 15 మార్కులు ఇస్తానని వ్యాఖ్యానించారు. మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం అమెరికా కమాండింగ్ పొజిషన్‌లో ఉందన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్లు మరణించినట్లు ఒక అమెరికా హ్యూమన్ రైట్స్ గ్రూప్ తెలిపింది. యుద్ధ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయని, అంతర్జాతీయంగా కూడా దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలుదేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య రహస్య చర్చలు? అమెరికాతో సంప్రదింపులకు ఇరాన్ సంకేతాలు

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య రహస్య చర్చలు? అమెరికాతో సంప్రదింపులకు ఇరాన్ సంకేతాలు

ఈ సంప్రదింపులు మరో దేశానికి చెందిన స్పై ఏజెన్సీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఇరు దేశాల అధికారులు తెలిపారని రిపోర్ట్ పేర్కొంది. అయితే, తమ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని సంబంధిత ఏజెన్సీలు ఇంకా సందిగ్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, తదుపరి చర్యలపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై విశ్లేషకులు కూడా చర్చిస్తున్నారు. అంతేకాక, ఈ చర్చలు భవిష్యత్తులో వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న టెన్షన్స్ నేపధ్యంలో, మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. ఇండియా ఇంధన సంస్థల నిల్వలతో పాటు, విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లో సుమారు 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ (SPR) అంటారు. 2015లో ఫేజ్-1 ప్రారంభమై, భవిష్యత్తులో మరిన్ని SPR సైట్‌లు ఏర్పాటుచేయబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా కోసం వీటిని ఉంచారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మహిళల హక్కులు, సమానత్వంపై అవగాహన

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మహిళల హక్కులు, సమానత్వంపై అవగాహన

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల సాధనలు, సమాజానికి వారు చేసిన సేవలను గౌరవించేందుకు ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అదే సమయంలో మహిళల హక్కులు, లింగ సమానత్వంపై అవగాహన పెంచడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారు. 2023లో కనీసం 51,100 మంది మహిళలు హత్యకు గురయ్యారని నివేదిక తెలిపింది. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ హక్కులు. న్యాయం. చర్య. అందరు మహిళలు మరియు బాలికల కోసం గా ప్రకటించారు. మహిళలు మరియు బాలికల హక్కులను కాపాడటానికి సమాన న్యాయం కల్పించాలని ఈ థీమ్ పిలుపునిస్తోంది.

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి: అమెరికా నౌకాదళ దాడిపై ఇరాన్ హెచ్చరిక

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి: అమెరికా నౌకాదళ దాడిపై ఇరాన్ హెచ్చరిక

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకాదళం ఇండియన్ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా యుద్ధనౌకను మంగళవారం రాత్రి ముంచివేసిందని సమాచారం. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ చర్యను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా ఖండించారు. ముందస్తు హెచ్చరిక లేకుండా అంతర్జాతీయ జలాల్లో ఈ దాడి జరిపారని ఆయన పేర్కొన్నారు. “అమెరికా చేసిన ఈ చర్యకు తీవ్ర పరిణామాలు ఉంటాయి, వారు దీన్ని తప్పక పశ్చాత్తాపపడతారు” అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ యుద్ధానికి దౌత్య పరిష్కారం కావాలి… భారత్‌కు మద్దతుగా చైనా

ఇరాన్ యుద్ధానికి దౌత్య పరిష్కారం కావాలి… భారత్‌కు మద్దతుగా చైనా

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ యుద్ధానికి దౌత్య మార్గంలో పరిష్కారం కావాలని చైనా పిలుపునిచ్చింది. ఈ విషయంలో భారతదేశం అభిప్రాయాన్నే బీజింగ్ కూడా సమర్థించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ, అవసరమైతే చైనా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉందని తెలిపారు. విదేశాంగ మంత్రి వాంగ్ యి గల్ఫ్ దేశాల నాయకులతో చర్చలు జరిపారని చెప్పారు. ముఖ్యంగా **అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్**తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు.

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ నిర్ణయాన్ని ప్రశ్నించిన డెమోక్రాట్లు

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ నిర్ణయాన్ని ప్రశ్నించిన డెమోక్రాట్లు

ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయంపై అమెరికాలో డెమోక్రాట్లు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికాకు తక్షణ ముప్పు ఏదీ లేకపోయినా ఈ యుద్ధానికి దిగారని వారు ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందస్తు దాడి ద్వారా ఇరాన్ ప్రతీకార చర్యలను అడ్డుకున్నామని చెప్పగా, ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. అయితే డెమోక్రాట్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ఈ యుద్ధానికి సరైన కారణాలు లేవని, స్పష్టమైన ప్రణాళిక కూడా లేదని విమర్శించారు.

ఇరాన్ దాడుల ఎఫెక్ట్‌… హార్ముజ్ జలసంధి వద్ద షిప్పుల నిలిపివేత, భారత్‌కు చమురు సరఫరా సున్నా

ఇరాన్ దాడుల ఎఫెక్ట్‌… హార్ముజ్ జలసంధి వద్ద షిప్పుల నిలిపివేత, భారత్‌కు చమురు సరఫరా సున్నా

Hormuz వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. ఇరాన్‌పై జరిగిన దాడుల ప్రభావంతో అక్కడ షిప్పుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భారత్‌కు వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరిలో రోజుకు సగటున 28 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా భారత్‌కు చేరగా, మార్చి 1 నాటికి అది పూర్తిగా ‘సున్నా’కు చేరింది. మన దేశ అవసరాల్లో సుమారు 50% చమురు, దాదాపు 100% LPG ఇదే రూట్ నుంచి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఖమేనీ మృతి తర్వాత కూడా ఇరాన్ దూకుడు… ఐఆర్‌జీసీ దాడులతో ఉద్రిక్తతలు

ఖమేనీ మృతి తర్వాత కూడా ఇరాన్ దూకుడు… ఐఆర్‌జీసీ దాడులతో ఉద్రిక్తతలు

అలీ ఖమేనీ మరణించాడు యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లకు దీటుగా బదులిస్తూ, వాటికి మద్దతిచ్చిన గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ చర్యలను ఇరాన్ సెక్యూరిటీ నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నిర్వహిస్తోంది. సుమారు 1.50 లక్షల మంది సైన్యం కలిగిన ఈ దళానికి ఖమేనీ తుది అధిపతిగా ఉంటారు. ఇదే సమయంలో ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ కూడా హతమైనట్లు సమాచారం. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భారత్‌కు తిరిగి రావాలనుకునేవారికి ప్రస్తుతం ఒకే ప్రత్యామ్నాయం ఉందని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తెలిపారు. అదే Oman మార్గం. ఆ దేశంపై ఇరాన్ దాడులు చేయకపోవడంతో, భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Dubai నుంచి ఒమన్ రాజధాని Muscat వరకు సుమారు 450 కిలోమీటర్లు బైరోడ్ ప్రయాణించాల్సి ఉంటుంది.

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు

వెస్ట్ ఏషియా యుద్ధ ప్రభావం: యూరప్‌లో గ్యాస్ ధరలు 22% ఎగసివేత

వెస్ట్ ఏషియా యుద్ధ ప్రభావం: యూరప్‌లో గ్యాస్ ధరలు 22% ఎగసివేత

వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. సౌదీ అరామ్కో రిఫైనరీపై ఇరాన్ దాడి తర్వాత యూరప్‌లో గ్యాస్ ధరలు గంటల్లోనే 22% పెరిగాయి. సుమారు $2 ట్రిలియన్ నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న యూరప్‌కు ఇది పెద్ద, తీవ్రమైన, ఆందోళన కలిగించే, ఆర్థిక విపత్తుగా మారింది. పరిస్థితి మార్కెట్ స్థిరత్వం ను కూడా ప్రభావితం చేస్తుంది, పెట్టుబడిదారుల ఆందోళన ఇంకా పెరుగుతోంది.

ఆంథ్రోపిక్ కృత్రిమ మేధపై ట్రంప్ ఆంక్షలు.. ప్రభుత్వ వినియోగానికి నిలిపివేత

ఆంథ్రోపిక్ కృత్రిమ మేధపై ట్రంప్ ఆంక్షలు.. ప్రభుత్వ వినియోగానికి నిలిపివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన క్లాడ్ కృత్రిమ మేధ సాంకేతికతను ప్రభుత్వ సంస్థలు వెంటనే వినియోగించడం నిలిపివేయాలని ఆదేశించారు. యుద్ధ అవసరాలకు అనుగుణంగా భద్రతా పరిమితులు తొలగించాలని పెంటగాన్ కోరగా, ఆంథ్రోపిక్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. స్వయంచాలక ఆయుధాల తయారీలో సహకరించలేమని సంస్థ స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ మండిపడి, సైన్యం ఎలా పోరాడాలో నిర్ణయించే అధికారం ప్రైవేట్ సంస్థలకు లేదని వ్యాఖ్యానించారు

కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె తుపాకీతో శిక్షణ… వారసత్వంపై ఊహాగానాలు

కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె తుపాకీతో శిక్షణ… వారసత్వంపై ఊహాగానాలు

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జూ ఏ తుపాకీతో కాల్చుతున్న అరుదైన ఫోటోను శనివారం విడుదల చేయడంతో వారసత్వంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. కిమ్ జూ ఏను భవిష్యత్ నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్నికొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. షూటింగ్ రేంజ్‌లో రైఫిల్‌తో లక్ష్యాన్ని గురి చేస్తూ జూ ఏ కనిపించింది. ఇటీవల జరిగిన సైనిక పరేడ్‌లలోనూ ఆమె పాల్గొనడం రాజకీయ ప్రాధాన్యతను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు

ఓపెన్‌ఏఐకి రికార్డు ఫండింగ్‌… $110 బిలియన్ల పెట్టుబడి, విలువ $730 బిలియన్లు

ఓపెన్‌ఏఐకి రికార్డు ఫండింగ్‌… $110 బిలియన్ల పెట్టుబడి, విలువ $730 బిలియన్లు

చాట్‌జీపీటీ తయారీ సంస్థ **OpenAI**కు భారీ ఫండింగ్‌ లభించింది. అమెజాన్, ఎన్విడియా, సాఫ్ట్‌బ్యాంక్ నుంచి మొత్తం $110 బిలియన్ల పెట్టుబడి వచ్చింది. దీని ద్వారా ఓపెన్‌ఏఐ ప్రీ-మనీ విలువ $730 బిలియన్లకు చేరింది. అమెజాన్ $50 బిలియన్లతో ముందుండగా, మిగతా రెండు సంస్థలు తలో $30 బిలియన్లు పెట్టాయి. సీఈవో అమెజాన్, ఎన్విడియా, సాఫ్ట్‌బ్యాంక్ ప్రకారం, **ChatGPT**కు వారానికి 900 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో అమెజాన్ వెబ్ సేవలు ఓపెన్‌ఏఐకి ప్రధాన క్లౌడ్‌ భాగస్వామిగా కొనసాగనుంది

HPV మహిళల సమస్య మాత్రమే కాదు… పురుషుల్లోనూ పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు

HPV మహిళల సమస్య మాత్రమే కాదు… పురుషుల్లోనూ పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు

హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV)ను ఇప్పటికీ మహిళల ఆరోగ్య సమస్యగా మాత్రమే భావించడం సాధారణం. గర్భాశయ క్యాన్సర్‌తో దీని సంబంధం ఎక్కువగా తెలిసినప్పటికీ, వాస్తవం అంతకంటే విస్తృతం. HPV పురుషులను కూడా ప్రభావితం చేస్తూ టాన్సిల్ (ఓరోఫారింజియల్), ఆనల్, పెనైల్ క్యాన్సర్లకు కారణమవుతోంది. గత దశాబ్దంలో HPVతో సంబంధం ఉన్న టాన్సిల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయి. ధూమపానం, మద్యం అలవాట్లు లేని పురుషులకూ ఈ క్యాన్సర్ నిర్ధారణ కావడం గమనార్హం. గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, మెడలో గడ్డల వంటి లక్షణాలు చిన్నవిగా భావించి ఆలస్యంగా వైద్యులను సంప్రదించడం వల్ల నిర్ధారణ ఆలస్యం అవుతోంది

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ? F-16 కూల్చివేతపై తాలిబాన్ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ? F-16 కూల్చివేతపై తాలిబాన్ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక అమెరికా తయారీ F-16 యుద్ధ విమానం మరోసారి నష్టపోయిందా? అవునని తాలిబాన్ ప్రకటించింది. ‘ఆఫ్గానిస్తాన్ రక్షణ’ అనే ఎక్స్ ఖాతా, మండుతున్న F-16 శకలాల వీడియోను షేర్ చేసింది. విమానం వెర్టికల్ స్టెబిలైజర్‌పై పాకిస్థాన్ జెండా స్పష్టంగా కనిపించగా, ఎగ్జాస్ట్ సమీపంలో ‘85510’ నంబర్ దర్శనమిచ్చింది.గతంలోభారత వాయుసేన పాకిస్తాన్ F-16లను కూల్చిందన్న నివేదికలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్, కాబుల్ సహా పలు అఫ్గాన్ నగరాలపై దాడులు చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది.

ఫిబ్రవరి చివర్లో ఆకాశంలో అరుదైన గ్రహాల కవాతు

ఫిబ్రవరి చివర్లో ఆకాశంలో అరుదైన గ్రహాల కవాతు

ఫిబ్రవరి చివర్లో ఆకాశ ప్రేమికులకు అరుదైన ఖగోళ దృశ్యం కనిపించనుంది. ‘ప్లానెటరీ పరేడ్’గా పిలిచే ఈ ఘటనలో ఒకేసారి ఆరు గ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఫిబ్రవరి 28, శనివారం సూర్యాస్తమయం అనంతరం పడమటి దిశగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే మెర్క్యురీ, వీనస్, జూపిటర్, శాటర్న్ కంటిచూపుతోనే కనిపిస్తాయి. యూరేనస్, నెప్ట్యూన్‌ను చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరం అవుతుందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ ఖగోళ దృశ్యం కొన్ని రోజులపాటు కొనసాగనుంది

AI ప్రభావంతో భారీ ఉద్యోగ కోతలు… బ్లాక్ కంపెనీ సంచలన నిర్ణయం

AI ప్రభావంతో భారీ ఉద్యోగ కోతలు… బ్లాక్ కంపెనీ సంచలన నిర్ణయం

ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం అడ్డుపెట్టడం ఉద్యోగుల్లో 40 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (కృత్రిమ మేధ) వినియోగం పెరుగుతున్నదే ఇందుకు కారణమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. ప్రస్తుతం 10,000 మందికిపైగా ఉన్న సిబ్బందిని 6,000కు తగ్గించనున్నారు. 2024 నుంచి పలు దఫాలుగా లేఆఫ్స్ చేసిన బ్లాక్, తొలిసారి కృత్రిమ మేధ నే కారణంగా చూపడం గమనార్హం. ఈ నిర్ణయం టెక్ రంగంలో ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చను రేపిందని బీబీసీ పేర్కొంది.

India News

9 stories this week

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్: కర్ణాటక

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్: కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఫిన్‌ల్యాండ్, యూకే కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం క్రాష్… ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం క్రాష్… ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. విమానంలో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని ఐఏఎఫ్ భరోసా ఇచ్చింది. సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం విమానం గాల్లోకి ఎగిరింది. అయితే రాత్రి 7.42 గంటలకు రాడార్‌తో ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

రష్యా నుంచి భారత్‌కు భారీగా క్రూడాయిల్

రష్యా నుంచి భారత్‌కు భారీగా క్రూడాయిల్

అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు రానుంది. సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు ఇప్పటికే భారత తీరానికి సమీపంలో ఉన్నట్లు సమాచారం. అవి వచ్చే వారం మన దేశ పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ డేటా తెలిపింది. సింగపూర్ సమీపంలో ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలో భారత్‌కు రానున్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి స్పష్టమైన సంకేతం రాకముందే రష్యా ట్యాంకర్లు భారత్ వైపు మళ్లినట్లు సమాచారం.

నితీశ్ కుమార్ CM పదవిని రాజీనామా చేసి RSకు? రాజకీయాల్లో సంచలన ప్రచారం

నితీశ్ కుమార్ CM పదవిని రాజీనామా చేసి RSకు? రాజకీయాల్లో సంచలన ప్రచారం

CM పదవికి నితీష్ కుమార్ నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్‌కు కేంద్ర క్యాబినెట్‌లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్‌ను వెంటనే అమలు చేయలేదు. ఇప్పుడు నితీశ్‌ను కేంద్రమంత్రి చేసి, బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు BJP చేపట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది, రాష్ట్ర రాజకీయాలు కొత్త దిశలోకి వెళ్తున్నాయి

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న టెన్షన్స్ నేపధ్యంలో, మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. ఇండియా ఇంధన సంస్థల నిల్వలతో పాటు, విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లో సుమారు 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ (SPR) అంటారు. 2015లో ఫేజ్-1 ప్రారంభమై, భవిష్యత్తులో మరిన్ని SPR సైట్‌లు ఏర్పాటుచేయబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా కోసం వీటిని ఉంచారు.

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టిన అమెరికా–ఇరాన్ పోరుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య జరిగే పోరుగా వ్యాఖ్యానించిన ఆయన, ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానని ట్వీట్ చేసినట్లు సమాచారం. అమెరికాలో క్రైస్తవులు మెజార్టీగా ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ దేశం కావడం వల్ల ఇది రెండు మత సిద్ధాంతాల మధ్య పోరుగా భావించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి

రష్యా నుంచి మరో 5 ఎస్-400 స్క్వాడ్రన్లు కొనుగోలు దిశగా భారత్

రష్యా నుంచి మరో 5 ఎస్-400 స్క్వాడ్రన్లు కొనుగోలు దిశగా భారత్

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 Triumph స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్-400తో పాటు పలు అధునాతన క్షిపణులను కూడా కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎస్-400 కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 2018లో India ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటివరకు మూడే అందాయి. మిగిలిన రెండు సరఫరా కావాల్సి ఉంది.

12 ఏళ్లలో భారత స్వశక్తి వికాసం.. వాణిజ్య ఒప్పందాలకు ముందుకొస్తున్న అభివృద్ధి దేశాలు: ప్రధాని

12 ఏళ్లలో భారత స్వశక్తి వికాసం.. వాణిజ్య ఒప్పందాలకు ముందుకొస్తున్న అభివృద్ధి దేశాలు: ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ తన అంతర్గత శక్తిని గుర్తించిందని అన్నారు. న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్‌లో ప్రసంగించిన ఆయన, ఈ పెరిగిన ఆత్మవిశ్వాసం కారణంగానే అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు ముందుకొస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా వలస మనస్తత్వం కొనసాగిందని, శతాబ్దాల బానిసత్వం దేశ సామర్థ్యంపై నమ్మకాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. దేశ బలం ఒక్కసారిగా రాదని, తరతరాల జ్ఞానం, సంప్రదాయం, కష్టపడి పనిచేయడం ద్వారా అది రూపుదిద్దుకుంటుందని ప్రధాని వివరించారు.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ ప్రచారానికి బ్రేక్

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ ప్రచారానికి బ్రేక్

ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర విషయాలు ఉన్నాయనే వివాదం తీవ్రరూపం దాల్చింది. దీనిపై విచారణ చేసిన భారత సుప్రీంకోర్టు పుస్తక ముద్రణ, పునర్ముద్రణతో పాటు డిజిటల్ ప్రచారంపైనా సంపూర్ణ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ వేదికలకు లేఖ రాసి ఆ పుస్తక ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా NCERT అభ్యంతరకర అంశాలపై క్షమాపణ తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రేంద్రప్రధాన్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

This Week in Numbers

Weekly Statistics & Insights

72
Total Articles
50
Featured Stories
7
Categories Covered
7
Days of Coverage